Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

శివుని పేర్లు

శివుని పేర్లు

వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులలో శివునికి అనేక పేర్లతో స్మరిస్తుంటారు. వాటిలో కొన్ని పేర్లు మీకోసం...

హర-హర మహదేవ, రుద్రుడు, శివుడు, అంగీరాగురు, అంతకుడు, అండధరుడు, అంబరీషుడు, అకంప, అక్షతవీర్యుడు, అక్షమాలి, అఘోర, అచలేశ్వరుడు, అజాతారి, అజ్ఞేయ, అతీంద్రియుడు, అత్రి, అనఘ, అనిరుద్ధ్, అనేకాలోచనడు, అపానిధి, అభిరాముడు, అభీరు, అభదన్, అమృతేశ్వర్, అమోఘ, అరిదమ్, అరిష్టనేమి, అర్ధేశ్వర్, అర్థనారీశ్వరుడు, అర్హత్, అష్టమూర్తి, అస్థమాలి, ఆత్రేయ, ఆశుతోష్,

ఇంద్రభూషణుడు, ఇందుశేఖరుడు, ఇకంగ, ఈశాన్, ఈశ్వరుడు, ఉన్నమత్తవేషుడు, ఉమాకాంతుడు, ఉమానాథ్, ఉమేష్, ఉమాపతి, ఉరగభూషణ్, ఊర్ధ్వరేతా, ఋతుధ్వజ, ఏకనయన్, ఎకపాద్, ఎకలింగ, ఎకాక్ష, కపాలపాణి,

కమండలధర, కళాధర్, కల్పవృక్ష, కామరిపు, కామారి, కామేశ్వర్, కాలకంఠ, కాలభైరవ, కాశీనాథ్, కృత్తివాసా, కేదారనాథ్, కైలాశనాథ్, క్రతుధ్వసీ, క్షమాచార్, గంగాధర, గణనాథ, గణేశ్వర, గరళధర, గిరిజాపతి, గిరీష్, గోనర్ద్, చంద్రేశ్వర్, చంద్రమౌళి, చీరవాసా, జగదీశ్, జటాధర, జటాశంకర్, జమదగ్ని, జ్యోతిర్మయ్,

తరస్వీ, తారకేశ్వర్, తీవ్రానంద్, త్రిచక్షు, త్రిధామా, త్రిపురారి, త్రియంబక్, త్రిలోకేశ్, త్రయంబక్, దక్షారి, నందికేశ్వర్, నందీశ్వర్, నటరాజ్, నటేశ్వర్, నాగభూషణ్, నిరంజన్, నీలకంఠ, నీరజ,

పరమేశ్వర్, పూర్ణేశ్వర్, పినాకపాణి, పింగలాక్ష్, పురందర్, పశుపతినాథ్, ప్రథమేశ్వర్, ప్రభాకర్, ప్రళయంకర్, భోలేనాథ్, బైజనాథ్, భగాలీ, భద్ర, భస్మశాయీ, భాలచంద్ర్, భువనేశ్, భూతనాథ్, భూతమహేశ్వర్,

మంగలేశ్, మహాకాంత్, మహాకాల్, మహాదేవ్, మహారుద్ర్, మహార్ణవ్, మహాలింగ్, మహేశ్, మహేశ్వర్, మృత్యుంజయ, యజంత్, యోగేశ్వర్, లోహితాశ్వ్, విధేశ్, విశ్వనాథ్, విశ్వేశ్వర్, విషకంఠ్, విషపాయీ, వృషకేతు, వైద్యనాథ్,

శశాంక్, శేఖర్, శశిధర్, శారంగపాణి, శివశంభు, సతీష్, సర్వలోకేశ్వర్, సర్వేశ్వర్, సహస్రభుజ్, సాంబ, సారంగ, సిద్ధనాథ్, సిద్ధీశ్వర్, సుదర్శన్, సురర్షభ్, సురేశ్, హరిశర్, హిరణ్య, హుత్ సోమ్, స్రుత్వా మొదలైనవి.

శ్రావణ మాసం - మంత్ర జపంతో ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడం ఎలా !

 
శ్రావణ మాసంలో శివారాధన చేస్తే భోలాశంకరుని కరుణా కటాక్షాలు లభించి మనోసిద్ధి ఫలిస్తుందని పండితులు అంటున్నారు. ఇక్కడ ఇచ్చిన కొన్ని మంత్రాలు ప్రతి రోజూ రుద్రాక్షమాలతో జపిస్తే ఫలితముంటుందని వారు తెలిపారు.

జపం చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తర ముఖం వైపు కూర్చొని జపించాలి. జపం చేసేముందు శివుడ్ని బిల్వ పత్రాలతో పూజించాలి.

క్రింద పేర్కొనబడిన మంత్రాలను జపించి భోలాశంకరుని కృపకు పాత్రులవ్వండి...

 ॐ నమః శివాయ

 ప్రౌం హ్రీం ఠః

 ఊర్థ్వ భూ ఫట్

 ఇం క్షం మం ఔం అం

 నమో నీలకంఠాయ

 ॐ పార్వతీపతయే నమః

 ॐ హ్రీం హ్రౌం నమః శివాయ

 ॐ నమో భఘవతే దక్షిణమామూర్తయే మహ్యం మేధా ప్రయచ్ఛ స్వాహా

ఇలా మంత్ర జపం నియమ నిష్టలతో చేస్తుంటే తమరు అనుకున్న అన్ని కోరికలు నెరవేరుతాయని పండితులు సూచిస్తున్నారు.

స్వప్న ఫలితములు

                               


 సుస్వప్నములు
 మెడ, పర్వతం, రధము, గుర్రము, ఏనుగు, నీటిని చూచుట, ఎక్కుట, ప్రభువు లేక రాజు, తెల్లని ఎద్దు,ఆవు, దీపము, అన్నము, ఫలము, పుష్పములు, కన్య, అగ్ని, వేశ్య,తెల్లని పాము, మాంసము,ముత్యములు, మధ్యము, గంగా స్నానము, దేవా దర్సనం, పూర్ణ కుంభము, కన్యతో సంభోగం, వీటి వలన ఆరోగ్యం,ధనము,స్త్రీ లాభము కలుగును

దుస్వప్నములు

 క్రూర జంతువులు,అద్దములో తన ముఖము కనపడక పోవుట,కోతి తరుముట, గాడిద ఎక్కుట, పత్హి, నునే,ఎనుబోతు,ఉప్పు,ఇనుము, దొంగలు, రక్షక్ భటులు, బురద,నీటి యందు మునుగుట,రోగము వచ్చు నట్లు కనబడుట, వీటి వలన మృత్యు భయము, హాని కలుగును

బల్లి పడుటవలన ఫలితములు


శిరస్సున-కలహం
ముఖము నందు- బందు దర్శనం
ఫై పెదవి యందు- ధనావ్యయం
క్రింద పెదవి యందు ధనలాభం
ముక్కు చివరాన-రోగం
కుడి చెవి -దేర్ఘాయువు
ఎడమ చెవి- వ్యాపార లాభం
నేత్రముల యందు-ఖైదు
ముంగురుల యందు- శిక్ష
నుదురు యందు-భయము
కంటమునా-శత్రువు హాని
ఎడమ భుజామున- స్త్రీ భోగము
కుడి మణి కట్టు యందు- కీర్తి
స్తనముల యందు-దోషము
కడుపు మీద- ధనా లాభము
నాభి యందు- ధనా లాభము
పార్శ్వముల యందు-లాభము
తొడల యందు-పిత్రాజీతం
ప్రక్కల యందు-సుఖము
కాళ్ళ యందు-ధన వ్యయం
లింగమున- దారిద్రం
జుట్టు చివరన- మృత్యు భయం
తలమీద నుండి క్రిందకు దిగిన -హాని
క్రింద నుండి పైకి పాకిన,ప్రాకిన వెంటనే క్రిందకు దిగినను మంచిది


   శరీరంఫైనా ఎక్కడ బల్లి పడినాను వెంటనే శిర స్నానము చేసి నూనెతో దీపం పెట్టి దోష నివారణా చేసుకొని ,ఇష్ట్ట దైవ ప్రాద్దన చేసుకొవలెను

నాగ దోషం ,కాల సర్ప దోషం నివారనోపాయలు


                           కాల సర్పం యోగం పట్టినవారు.సప్తమ,అష్ట్టమాల్లో రాహు కేతువులు ఉన్నవారు.పూర్వ జన్మలో పాములను చంపినా వారు లేదా మంత్ర తంత్ర విధి విధానాలతో బంధించినవారు,పాముల పుట్టలను త్ర్రావ్వి ఇండ్లు కట్టిన వారు నాగదోషం కలవారై పుడుతారు.అటువంటి వారు వివాహం,సంతానం,కుటుంబ అభివృద్ధి విషయాల్లో అడ్డంకులు,అవమానాలు పొంది,విరక్తి కలిగి జీవితం అంతం చేసుకొందమనే స్తితికి వస్తారు..

1.నాగదోషం త్రీవ్రమైనది అయితే శుక్ల పౌడ్యమినాడు శ్రీకాళహస్తిలో  నిద్రచేసి మరుసటి దినం శివ దర్శనం చేసి పూజలు జరిపించుట వల్ల నివారణ కల్గుతుంది

2.ఆరు ముఖాల రుద్రాఅక్షాలు చెవులకు లేదా గాజులలకు లేదా ఉంగరంగా ధరించుట వల్ల ,ఏనుగు తోక వెంట్రుకలు ఉంగరంగా లేదా చేతికి కడియంగా ధరించుట వల్ల నివారణ పొందగలరు

3.నాగ ప్రతిమకు 27 దినాలు పూజచేసి దేవాలయమునకు దానం చేయవలేయును.

4. రాహు కాలంనందు ప్రతి సోమవారం నాగ దేవతకు క్షేరాన్ని నివేదన చేసి పూజ చేయాలి. లేదా రాహు కాలంనందు నాగ దేవతకు క్షేరాన్ని నివేదన చేసి  నవగ్రహ ఆలయంలో దానంగా ఇచ్చుట వల్ల నివారణ కల్గును

5.త్రీవ్ర్రమైన నాగదోషంఉన్న యడల నాగ పంచమి రోజున శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించి దుర్గ, పాతాళ వినాయకుని దర్శించి పూజించటం వల్ల నివారణా కల్గును


తిరుమల గురించి కొన్ని నిజాలు




1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.

2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.
3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ.

4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.

5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.

6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు.

7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.

8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.

9. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.

10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.

11. 1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు.

మన హిందూ సాంప్రదాయం ప్రకారం శుభ- అశుభ సూచకములు


మనం నడిచే దారిలో స్త్రీ నెత్తిన మంచి నీళ్ళా బిందే కానీ కుండతో  కానీ మనలల్ని దాటుకుని వెళ్ళిన అధి శుభ సూచకం

మనం నడిచే దారిలో వితంతువు ( ఒక వేళా గుండు చేయిoచు కొన్న) మనలల్ని దాటుకుని వెళ్ళిన అధి అశుభం.

మనం నడిచే దారిలో మంగళివాడు తన  సామగ్రితో మనకు ఎదురు పడినా అధి శుభ సూచకం

ఎవరైనా మన దారిలో ఒక మైనా పక్షుల జంటను చూసినా అధి శుభ సూచకం

మన ప్రవేశ ద్వారం(ఇంటి గడప ) మీద నిలబడి తుమ్మిన అధి అశుభం.దీన్ని నివారించాలంటే అదే గడప మీద నిలబడి నెత్తిన పసుపు నీటిని చల్లు కోవాలి

మన ఇంటిలోకి ప్రవేశించుచున్న ఆవు శుభ సూచకంగా మన పెద్దలు చెప్పుతారు

మన దేవాలయంలో దేవుడికి వేసిన పూలు,దేవుడి కి కుడి ప్రక్కన  క్రింద పడినచో అది శుభ సూచకం

మనం నడిచే దారిలో ఆవును,ఆవుతో పాటు దూడను ఒకే సారి చూచిన ఎడల అది శుభ సూచకం

మన రహదారిలో ముంగిస కనపడిన ఎడల అది శుభ సూచకం

మన ఇంటిలో కానీ ,కార్యాలయాల్లో కానీ బల్లి అరిచిన అది అశుభం.

మన ఇంటి ఆరు బయట కాకి ,అదే పనిగా అరుస్తుంటే మన ఇంటికి ఎవరో బంధువులు వస్తున్నారు అని సంకేతంగా చెప్పుకోస్తారు మన  పెద్దలు

మన ఇంటిలో పెంచుకొనే పెంపుడు కుక్క మనం బయటకు వెళ్ళేతప్పుడు తుమ్మిన  అది మనకు శుభ సూచకం

సకల కార్య సిద్దికి గణేశా పూజా విధానము- ఫలితములు

బాల గణేశుని శిరస్సు శివునిచే ఖండింపబడి, తిరిగి హస్తిముఖునిగా ప్రాణ ప్రతిస్ట్ట జరిగిన తరువాత ,ప్ర ప్రదమంగా తల్లి పార్వతి దేవి సిందూరాన్ని బొట్టుగా గణేశునకు పెట్టింది.ఆ కారణం చేత ఎవరైతే గణేశుని ప్రతి దినం సింధూరంతో పూజిస్తారో,వారి అడ్డంకులు అన్ని తొలగి విజయం కల్గుతుందని శ్రీ పార్వతి దేవి వరం ప్రసాదించింది.


ప్రతి నేల శుద్ధ చతుర్హి నాడు గణేశుని పూజించి,భాద్ర పద శుద్ధ చతుర్హ్హి అంటే వినాయక చవితి నాడు ఉద్వాసన చేసినచో లబించని సిద్దులంటే ఉండవు

 మార్గ శిర్ష శుద్ధ చతుర్ధిని " రమా చతుర్ధి " అంటారు. ఆ రోజున ఉపవసించి,విధి విధానంగా గరికలతో పూజించి,రాత్రి మొదట జామున కూడా పూజించ వలెను. గరికలు మూడు కణుపులు కలివిగా ఉండాలి. మట్టి, పగడం,జిల్లేడు వేరులతో ప్రతిమను చేయుట మంచిది. రాత్రి మొదటి జామున పూజాయైన పిదప, బాలచంద్రుని పూజించావలెను. తదుపరి విప్రులకు భోజనం పెట్టాలి.  రాత్రికి లవణ వర్జితమైన మదుర భోజనం తినాలి.ఈ  పూజా విధానం వలన సకల అడ్డంకులు తొలగి,అనుకొన్న సకల కార్యాలు  నెరవేరుతాయి.

రాహు గ్రహ ఆరాధనా రహస్యాలు-నివారనోపాయలు

                                          రాహు గ్రహ ఆరాధనా రహస్యాలు
విదేశీయుల పద్దతి ప్రకారం రాహువు గ్రహం కాదు. పరాశురుడు కూడా గ్రహంగా అంగికరించలేదు.ప్రాచీనులు రాహువును ఛాయా గ్రహం అని అన్నారు. ఛాయా అనగానే ఇంకొక దానికి నీడ లేదా ప్రతిబింబము అని అర్ధం.అందుకే మన ఆర్యులు "శనివత్త్ రాహు" అని శని గ్రహానికి బదులుగా రాహువని బావించారు.రాహువును గ్రహం అనుట కంటే విధ్యుదయ స్కంతావరణ మనుట సమంజసం.అన్ని గ్రహాలు  రవి వలన అస్తంగతులైతే,రవి చంద్రులను సహితం నిస్తేజులుగా చేయగల చండ ప్రచండుడు రాహువు.అందుకే ఈయన స్త్రోతంలో "చంద్రాదిత్య విమర్ధనం" అని మర్దించే శక్తీ రాహువుకు కలదని చెప్పబడింది.ప్రాణ శక్తీ కారకుడైన సూర్యుని,మనః శక్తీకి కారకుడైన చంద్రుని మర్ద్దించే శక్తీ కలదు.కావునే రాహు మహా దశః భాగులేనివారు పడే పాట్లు అన్ని ఇన్ని కావు.

పురాణాల ప్రకారం దక్షుని కూతురు సింహికకు కస్యపునికి రాహువు జన్మించాడు. పైటినసగోత్రజుడు పార్ధవా నామ సంవత్సర భద్రా పద పౌర్ణమి  పూర్వభద్రా నక్షత్రామందు జన్మించాడు.మ్లేచ్చ స్వభావం కలిగినవాడు.సూర్యునికి నైరుతి దిశలో శూర్పకార మండలంలో సింహవాహునుడై,కరాళ వక్త్రంతో  ఉప విష్ణుడై వుంటాడు

                                            రాహు గ్రహ సామర్ద్యాలు

క్రోత్తదాన్ని దేన్నీయినా తెచ్చి పెట్టీ స్వభావం రాహువునిది.శరీరంలోకి ఫారిన్ మీటర్కానీ,మనుషులకు ఫారిన్ ప్రయాణం కానీ, వ్యక్తులతో పరిచయాలు కానీ,అలవాట్లతో అనుభూతులు కానీ కల్గించేవాడు రాహువు. ఈ గ్రహం గారడీ చేయిoచే శక్తి కలవాడు.అబద్ధాలు,అల్లకల్లోలాలు,క్రొత్త అలవాట్లు.క్రొత్త వేష భాషలు కల్గించడంలో సిద్దహస్త్తుడు.గ్రీకు పురాణ గాధల్లో డ్రాగన్ అనే రాకాసి బల్లి వంటి జంతువూ తలగా రాహువును,తోకగా కేతువును ప్రతికలుగ చిత్రీకరించారు.శని వాలే రాహువు కర్మ గ్రహం.పూర్వ జన్మ కర్మల్ని అతివిడ్డురంగా అనుబవింపచేయగలడు.దుర్మార్గ స్వభావం కలవారు అందలం ఎక్కడానికి సహస కార్యక్రమాలు చేపట్టి వారికీ చేయూత నివ్వడానికి,రాహువు బాగా సహకరిస్తాడు.రాహు మహా దశలో ఖచ్చితంగా పితృ కర్మలు చేయిస్తాడు.కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి రాహు దశఃకానీ,అంతర్ దశః కానీ జరుగుతున్నపుడు తండ్రి, తాత,తల్లి,అమ్మమ్మలో ఒకరికి ఆయువు తీరుతుంది. రాహువుకు యోగాలు కల్గించడం ఉన్నా,అనుబవంలో అవయోగాలు ఎక్కువుగా కల్గిస్తాడు."రాహు మహా దశః పట్టిందిరా అనెడి లోకోక్తి అల్పుల అందలం ఎక్కుట వల్ల ఏర్పడిందే.ఫారిన్ భాషలు,ఫారిన్ వస్తువులు ఫారిన్ జబ్బులు తెప్పించడంలో రాహువుదే ఆగ్రాతాంబూలం

                                                రాహువు కారకత్యాలు

రాజ్యాధికారం కల్పించుటలో ,పదవిచ్యుతుని చేయుటలో రాహువు కారకుడు
వర్ణాంతర వివాహాలు చేసుకోనటలో ప్రభావం కలవాడు.
కుట్రలు,పన్నాగాలు,ఎత్తు గడలు,కులద్రోయుట వంటి నీచ గుణాలు కల్గిస్తాడు
సాంప్రదాయాల సంస్కరణకు,మతబ్రస్థత్వాం పట్టిస్తాడు.
తక్కువ స్టితికల  స్త్రీ సాంగత్యానికి పూరి కోల్పుతాడు.
సంకుచిత ఆలోచనలు కల్గిస్తాడు.
వ్యసనపరులుగా,తిరుగుభోతులుగా మర్చి దుష్ట్ట స్నేహాలను కల్గిస్తాడు.
నైరుతి దిశలో కలిగే లాభ నష్టాలకు కారకుడు
పీడ కలలు,భయదోళనలు కల్పిస్తాడు.
రహస్య స్టావరాల పనులు,రహస్య మంతనాలకు ప్రేరేపిస్తాడు
వన దుర్గ దేవి ఆరాధనతో రాహువు ప్రీతీ చెందుతాడు
ఉర్దూ,పర్షియన్ వంటి విదేశీ భాషలు నేర్చుకోవడానికి కారకుడు

                                           రాహువు కల్గించే భాదలు

స్వంత బుద్ధి లోపించి ఇతరుల చెడు సలహాలను పాటించుట
ముర్ఖునిగా ప్రవర్తించుట,అధికార దుర్వినియోగం చేసి అల్లరి పలగుట
ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ వస్తువుల వల్ల నష్టాలు,పొలిసు గూడచారి సంస్తల వల్ల భాద కలుగును
కుటుంబంలో పెద్దవారికీ ఆకస్మిక మరణాలు, పిల్లలు తప్పిపోవుట లేదా ఎత్తుకు పోవుట
కోర్టు వ్యవ`హరల్లో ఇరుక్కు పోవుట
మిలటరీ సంబంధ, బిల్డింగ్  కాంట్రాక్టు సంబంధ నష్టాలు
పాములు, తేళ్ళు,గేదెలు,విష జంతువుల వల్ల భాధలు
విష గ్యాసులు,ఆమ్లాలు,వాతావరణ కాలుష్యం వల్ల ప్రమాదాలు
నూన్యత భావం
ఎక్కడికో పారి పోదామనే మానస్చాంచల్యం
జైలు వరకు తెసుకొని వెళ్ళుట చేయిస్తాడు
చంద్రునితో కలిస్తే  గొప్ప బుద్ధి చాంచల్యం కానీ పిచ్చి కానీ కల్గించవచ్చును.
కుజుని తో కలిసి చెడిపోతే ఆకస్మిక ప్రమాదాలు,దెబ్బ లాటలు,గాయాలు కల్గిస్తాడు
రవితో కలిస్తే తప్పకుండా తండ్రితో సత్సంబంధాలు దెబ్బ తీస్తాడు
శని రాహువుల కలయిక త్రీవ్రమైన పరిస్తితిలకు దారి తీయవచ్చును
గురునితో కలిస్తే సద్భావన ఉన్నా, తప్పని పరిస్టితిలలో తప్పులు చేయిస్తాడు
ఎంత రహస్యంగా పనులు చేసినా బహిర్ఘతం చేసి పరువు తీయిస్తాడు
రాహువు ఎంత యోగం కల్గించినా,ఎంతో కొంత అప్రతిస్ట్ట చేయకుండా ఉండలేడు


                                                  రాహువు కల్గించే రోగాలు

రాహువు వాయుతత్వ కారకుడు అవడం వల్ల మనవ శరీరంలోని సమస్త వాయు  సంబంద రోగాలను కల్గిస్తాడు.నొప్పి ఎక్కడుందో అక్కడ రాహువు ఉంటాడు.,కడుపు,నాభి, మర్మాంగాల నొప్పులకు ప్రతీక.ఉచ్చ్వాస నిశ్వాసల్లోని గమన సిలత్వాన్ని కంట్రోలు చేసే శక్తీ రాహువుది.ఉరఃపంజర సంబంద రోగాలను కల్గిస్తాడు. శుక్రరాహువుల కలయికతో చర్మ సౌoధర్యన్ని దెబ్బ తీస్తాడు. సమస్త మైన అంటు వ్యాధులకు రాహువు అధిపతి. టైఫాయిడ,మలేరియా, మసూచి, ఇన్ ఫ్లూ,అనేక రకాల వైరస్ జ్వరాలకు రాహువు పెట్టింది పేరు.కన్య రాశిలో వుంటే అన్ని రకాల పురుగులను  కడుపులో పెంచుతాడు. శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గించి,బ్యాక్తిరియను ఆహ్వానించడంలో రాహువు మొదటి వాడు. రాహువు స్టితి బట్టి పక్షవాతం,కిళ్ళ వాతం, నడుము నొప్పి మడాల పగ్గులు కల్గుతాయి

                                                     రాహు గ్రహ నివారనోపాయలు

రాహువుకు అధిదేవత పృద్వీ అని కొందరు,గౌ గోవులని కొందరు చెప్తారు.ప్రత్యదిదేవత సర్పములు,అధిప్రత్యది దేవతా సహితంగా పునశ్చరణ చేసి దార పోయుట వలన నివారణ కల్గును
రాహువుకు అధిష్టాన దేవత దుర్గా దేవి సప్తాసతి పారాయణం కానీ మంత్రం జపం కానీ ,కవచం కానీ పునఃశ్చరణ చేయుట వలన నివారణ పొందవచ్చును
చిన్నమాస్తాదేవిని విధి విధానంగా పూజించడం వల్ల రాహు గ్రహం దుష్పరిమనాలను నివారించవచ్చును
రాహు గ్రహ దోష నివారణకు శనివారం నాడు ప్రారంబించి వరుసగా 18 దినాలు పారుతున్న నీటిలోకి రోజుకోక కొబ్బరికాయ దార పోయుట వల్ల నివారణ కల్గును
పడుకొనే ముందు గదిలో  నెమలి పించాన్ని కనపడేటట్లు పెట్టి, తెల్ల వారు జామున లేవగానే చూచుట వల్ల రాహు గ్రహ పీడ నివారణ కల్గును

సంతానం కోరుకొనే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం


గణపతి పురాణంలో పూర్వం కృతవీరుడు అనే ఒక మహారాజు సకల భోగ భాగ్యాలతో,సకల సిరి సంపదలతో మరియు అందమైన భార్యతో సంతోషంగా రాజ్యం ఏలు తుండేవాడు.ఎంత కాలమైన అతనికి సంతానం కలగలేదు.ఎన్ని పూజలు,హోమాలు,యజ్ఞాలు చేసినా ఎన్ని వ్రతాలూ చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా సంతానం కలుగలేదు.ఒకనొక రోజు నారదున్ని కలిసి తనకు సంతానం కలుగుటకు తగిన తరుణోపాయం తెలపమని అడుగుతాడు.

నారదుడు తగిన తరుణోపాయం వెదుకుచు కృత వీరుని పిత్రులోకాలకు వెళ్లి అక్కడ కృతవిరుని తండ్రి,తాత,ముత్తాతలు నరక భాదలు అనుబావిస్తూ ఉండడం చూసి కృత వీరుని తండ్రితో ఇలా అన్నాడు. భూలోకంలో నీ కుమారుడు సంతానం లేక త్రివమైన మనో వేదనను అనుబావిస్తునాడు,నీ కుమారునికి సంతానం కలుగుటకు తగిన తరుణోపాయం తెలపమని నారదుడు అడుగుతాడు.అప్పడు కృత వీరుని తండ్రి నారుదునితో ,నా కుమారున్ని మహాగణపతి యూక్క సంకష్ట్టి వ్రతం చేయమని ,అలా వ్రతం చేస్తే తన కుమారినికి సంతానం కలుగుటే కాక,తనకు,తన తండ్రి ,తాత ముత్తాతలకు నరకలోక భాదలనుండి విముక్తి లబించగలదు అని తెలుపుతాడు.

నారదుడు భూలోకం వెళ్లి కృతవీరునితో శ్రీ మహాగణపతి  యొక్క సంకష్ట్టి వ్రతం చేయమని,ఈ వ్రతం చేయమని నీ తండ్రి తెలిపాడు అని కృతవీరునితో అన్నాడు.అప్పడు కృత వీరుడు ఎంతో సంతోషించి ఈ వ్రతం ఎప్పుడు ఎలా చేయాలో తెలుపామని నారదుణ్ణి అడుగుతాడు

 ఈ వ్రతం శ్రావణ బహుళ చవితి రోజుగాని మాఘ బహుళ చవితి రోజు మంగళవారం నాడు చంద్రోదయం పూట తలస్నానం చేసీ ఉపవాసం వుండి,సంకల్పం చేసుకొని సాయంత్రం వరకు ఉపవాసం చేసుకొని తిరిగి స్నానం ముగించుకొని  గణపతి ని ప్రాద్దిoచాలి.అదర్వ శీర్షంతో గణపతి ని అభిషేకించాలి .శ్రీ గణపతి మహామంత్రాన్ని జపించాలి.శ్రీ మహా గణపతికి  బెల్లంతో  చేసినా వంటకాలు,లడ్డులు,మోదకలు సమర్పించాలు.ముఖ్యంగా ఈ పూజలో తెల్ల జిల్లేడుతో పూలను,తుమ్మి పూలను పెట్టాలి అలాగే గరికను తప్పని సరిగా పెట్టాలి.గరికను పెట్టక పోతే వ్రతం నిష్పలం అవుతుంది.అని నారదుడు కృతవీరుని తో అన్నాడు.

  కృత వీరుడు ఈలా ఈ వ్రతాన్ని ఒక సంవత్సరం వరకు జరిపించి, సంతానం పొందాడు అని,అలాగే తన పితృ,తాత,ముత్తతలు నరకం నుంచి తప్పించాడని గణపతి పురాణంలోని ఈ ఒక కధ చెబుతుంది

  ఎలాంటి విఘ్నాలు ఉన్న,చదువు రావాలన్న,సిరి సంపదలు కావాలన్నా ,ఆరోగ్యం కావాలన్నా,ముఖ్యంగా సంతానం కావాలని కోరుకొనే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం ఈ సంకష్ట్టి వ్రతం. 

కుజ దోషం నివారణ మార్గం -ఏది ఎలా ఎప్పుడు చేయాలి?


మన పురాణాలలో కుజ గ్రహం ను,అంగారకుడు అని,మంగళుడు అనే నామాలు ఉన్నాయి.అలాగే కుజుడు భూమి పుత్రుడు అని కూడా తెలుసు..ఒక సారి కుజుడు తన తల్లి తండ్రుల అనుమతి తీసుకోని వినాయకుడి గురించి తపస్సు చేయడానికి నర్మదా నది తీరంలో ఒక ప్రదేశంను ఎంచుకొని  నిరాహారంగా 1000 సంవత్సరాలు గణపతి గురించి తపస్సు చేసినాడు.అలా 1000 సంవత్సరాలు కుజుడు తపస్సు చేసినా తరువాత మాఘ బహుళ చవితి చంద్రోదయం నాడు వినాయకుడి ప్రతక్ష్యమయ్యాడు.అలా ప్రతక్ష్యమైన వినాయకుడు ఎలా ఉన్నాడు అంటే దశా భుజాలు కలిగి బాలుడి గా ఉన్నాడు.అదే విధంగా వినాయకుడి తలమీద ఒక చంద్ర వంక కూడా ఉన్నదీ.

             వినాయకుడు,అంగారకుడు తో ఇలా అన్నాడు." నీ తపస్సుకు మెచ్చితిని నీకు ఏమి వరం కావాలో అని కోరుకొమ్మన్నాడు.అప్పుడు అంగారకుడు ఎంతో సంతోషించి ఆ వినాయకుడిని ఎన్నో విధములుగా స్తుతించాడు.అలా ప్రతక్ష్యమైన వినయకుడ్నిని  అంగారకుడు తనకు " అమృతం" కావాలని,అదే విధంగా నేను ఎప్పడు నీ నామ స్మరణ చేస్తుండాలని అని వరమియమని అంగారకుడు కోరుకొన్నాడు అప్పుడు వినాయకుడు తదాస్తు అని దీవించి ,నీవు ఎర్రని రంగులో ఉన్నావు ఎర్రని వస్త్రం కట్టుకోన్నావు,ఈ దినం మంగళవారం.కనుక ఇక నుంచి నీ పేరు మంగళుడు అని వరం ఇచ్చి వినాయకుడి అంతర్ధానం అయ్యాడు.ఆ తర్వాత అంగారకుడు(మంగళుడు) అమృతం ప్రాప్తిస్తుంది

               అమృతం సేవించిన తరువాత కుజుడు(మంగళుడు) ఒక ఆలయం కట్టించి అందులో వినాయకుడిని ప్రతిష్టించి ,ఆ వినాయకుడిని శ్రీ మంగళమూర్తి అని పేరు పెట్టాడు.ఈ ఆలయం ఇప్పటికి మన భారత దేశంలో ఉంది.అదేవిధంగా వినాయకుడు ఇంకొక వరం కుజుడికి ప్రసాదించాడు. ఎవరైతే అంగారక చతుర్ధి రోజు( బహుళ చతుర్ధి ,కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి లేదా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి రోజు) మంగళవారం రోజున ఉపవాసం ఉండి వినాయకుడికి భక్తి శ్రద్దలతో పూజచేస్తారు వారికీ ఉన్న అన్ని కుజగ్రహ దోషాలు అన్ని తొలగిపోతాయి.అని వరం ప్రసాదించాడు అలాగే వినాయకుడి  అనుగ్రహం కూడా కలుగుతుంది.ఈ పూజా ఫలం ఎటువంటిది అంటే ఒక సంవత్సరం సంకష్టి వ్రతం అంటే ఒకక్క నెలలో ఒక చతుర్ద్ది వస్తుంది..అలా 12 నెలలు ఎవరు వ్రతం చేస్తారో?అలా చేయడం వల్ల ఎలాంటి పుణ్య ఫలం వస్తుందో ఈ ఒక్క అంగారక చతుర్ధి రోజున చేసీ వినాయకుడి వ్రతం వల్ల కలేగే ఫలితం సమానం..అలాగే అన్ని దోషాలు,ముఖ్యంగా కుజ దోషాలు సంపూర్ణంగా నివారించాబడతాయి
 

మన తెలుగు సాంప్రదాయం-మన ఉగాది


                             తెలుగు  సంప్రదాయానికి ప్రతీక.... మన ఉగాది

తెలుగు సంప్రదాయానికి అద్దం పడుతూ ప్రకృతిని మన ముంగిటకు తెచ్చేదే ఉగాది.అంతే కాదు.అంతకు ముందున్న స్లేషం,వాతపు నొప్పులు,అస్తవ్యస్తంగా ఉన్న మన ఆరోగ్యానికి క్రొత్త జీవాన్ని ఇచ్చే సందడి ఈ పర్వ దినం. వీటిన్నిoటితో పాటు ఉగాదికి మరో ప్రాముఖ్యం ఉంది.ఈ [పండుగకు మాత్రమే తినేది ఉగాది పచ్చడి తీపి,పులుపు,కారం,ఉప్పు,వగరు,చేదు అనే ఆరు రుచుల కలిసిన ఉగాది పచ్చడిని తింటాం

  " మాసానాం మార్గశిర్మోహం...రుతూనాం కుసుమాకర... అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మా చెప్పారు.మాసాల్లో మార్గశిర మాసం రుతువుల్లో వసంత రుతువు ఉత్తమమైనది.మన పండుగలు అన్ని రుతువులఫైనే ఆధారపడి ఉంటాయి.ఉగాది వసంత రుతువులో వస్తుంది.అ రోజుల్లో ప్రకృతి అత్యంత రమణియంగా ఉంటుంది.తరుశాఖల చిగురులు.. పక్షుల కిల కిలారావాలు.. మామిడి చిగుళ్ళును ఆస్వాదించిన కోకిలల ఆలావనలు..అలా పరవశించిన ప్రకృతి ఒడిలో అందరూ ఉగాది సంబరాలు జరుపుకొంటారు ఉగాది పండుగ రావడంతో తెలుగిళ్ళు కళ కళలాడుతుంటాయి.ఎవరెన్ని కష్టాల్లో ఉన్నప్పిటికీ ఆ రోజున మాత్రం ఆనందంగా గడుపుతారు.ఎందుకంటే ... సంవత్సరం ప్రారంభం రోజున ఎలా ఉంటె... సంవత్సరం అంతా అలానే ఉంటారనేది నమ్మకం


               ఉగాది పచ్చడి- ప్రాముఖ్యం

ఉగాదినాడు బ్రాహ్మి ముహూర్తంలో నిద్ర లేచి అభ్యంగన స్నానం చేయాలి.నూతన వస్త్రాలను ధరించాలి.గడపకు పసుపు కుంకుమ,గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించాలి.భగవంతున్ని ప్రార్ధిoచాలి. ప్రధానంగా ఉగాది రోజున భగవంతుడికి నైవేద్యంగా ఉగాది పచ్చడి ఉంచడం తప్పనిసరి.


 క్రొత్త నిర్ణయాలు తీసుకొనేందుకు పంచాంగా శ్రవణం చేయడం ఉగాది నాడు విశిష్టత.పంచాంగం అంతే అయిదు అంగములు అని అర్ధం.తిధీ,వారం,నక్షత్రం,యోగం,కరణం అనేవి ఆ అయిదు అంగాలు 15 తిధులు,7 వారాలు,27 నక్షత్రములు,27 ,11కరణములు ఉన్నాయి.వీటిన్నిoటిని తెలిపేదే పంచాంగం.వీటిని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలు అంటుoటారు.






కాల రూపుడు.....భైరవుడు !

కాల భైరవుడు అనగానే చాలామంది కుక్క అని తేలిగ్గా అనేస్తారు. కాని ఆయనకు చాలా విసిస్త్థత ఉంది. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు.గ్రహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపసానతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నయి.కాల భైరవుడిని కాశి క్షేత్ర పాలకుడిగా కీర్తించారు.ఏది సాదించాలన్నా ముందుగా అయన అనుమతి తీసుకోవాలని "కాశి క్షేత్ర మహిమ చెబుతుంది.సాక్షాత్తు శివుడే కాల భైరవుడే సంచారించాడని శాస్త్రాలు చెబుతున్నాయి.హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని,అతింద్రమైన శక్తులని అయన ప్రసాదిస్తారు.దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు.కొబ్బరి బెల్లం నైవేద్ద్యం పెడతారు.ఈశ్వరుడు ఆయుషును ప్రసాదిస్తాడు.ఆయనకు పరమ విధీయుడైన కాల భైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.

ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడం ఎలా ?

పరమేశ్వరుడుని ప్రసన్నం చేసుకోవడం చాలా సులువు.పెద్ద పెద్ద మ్రొక్కులు మ్రొక్కుకోనవసరం లేదు.నోరారా శివా అని స్మరిస్తూ చెంబేడు నీరు అయన శిరస్సు ఫైన పోసి,చేతికి అందిన పత్రిని ముఖంఫై వేస్తే చాలు..ఆ పరమ శివుడు ప్రసన్నుడుఅయి పోతాడు. సంతోషంతో ఉప్పొంగిపోయి,కామదేనువుని పెరట్తో కట్టేసి,కల్ప వృక్షాన్ని ఇంటి ముందు పాతేసి వెళతాడట.ఈ విషయాన్ని దుర్జాట్టి తన కాళహస్తిశ్వర మహత్యంలో ప్రస్తావించాడు

మొగలి పువ్వును,ఆవును శివుడు శపించాడా?

పూర్వం బ్రహ్మ విష్ణువులు,తమలో తము "నేను గొప్ప అంటే నేను గొప్ప" అని వాదించుకున్నారు.ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది.అది మరింతగా పెరిగి యుద్దానికి దారితీసింది.ఈ యుద్దానికి లోకాలన్నీ తల్లడిల్లాయి.దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకొన్నాడు.ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది.బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు.అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కలికంగా సద్దుమణిగింది.ఆ మహా లింగం మొదలు,తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది.బ్రహ్మ హంసా రూపం దరించి లింగం అగ్ర బాగాన్ని చూడడానికి,విష్ణువు వరాహ రుపమలో అదిని కనుక్కోవడానికి బయలు దేరాడు.బ్రహ్మకు ఎంతకు లింగం అగ్ర భాగం కాని మొదలు కాని కనిపించలేదు.ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం(మొగలి పువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని అపితనకు,బ్రహ్మకు,విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి,సహాయం చేయమని అడిగాడు. ఆవు కనపడితే అదే విధంగా చెప్పి,ఆ లింగం అగ్ర భాగాన్ని చూసినట్లుగా,విష్ణువుతో చెప్పేటప్పుడుఅది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాదేయపడ్డాడు.సాక్షాత్తు సృష్టి కర్తయే తనని బ్రతిమాలేసారికి కాదనలేక సరేనంటాను.రెండు,కిందకు దిగి వచ్చే సారికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు.బ్రహ్మ తాను లింగం అగ్ర భాగాన్ని చూశానని ,కావాలంటే అవును, మొగలి పువ్వును అడగమని చెప్పాడు..నిజమే అంది మొగలి పువ్వు,బ్రహ్మ దేవుడి మాటను కాదనలేక అయన లింగం అగ్ర భాగాన్ని చూసాడని ఆవు తలతో చెబుతుంది కాని,అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది.బ్రహ్మ దేవుడి అసత్య ప్రచారాన్ని చూడ లేక ఈశ్వరుడు ప్రతయ్యక్షమయ్యాడు.బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్దపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుతో భక్తులెవ్వరు తనను పూజించరాదని ,తెల్లవారి లేచి ఆవు ముఖం చూడటం కుడా పాప కారణం అని శపించాడు.ఆవు అభ్యర్దన మేరకు తోకతో నిజం చెప్పింది కాబట్టి వృష్టభాగం పవిత్రమైనది,తోక భాగాన్ని పూజించిన వారికీ పుణ్య ఫలాలు కలుగుతాయని వరమును  అనుగ్రహించాడు.మహేశ్వరుడు.


శివుడు అజ్ఞ లేనిదే చీమైనా కుట్టదా?

ఈ సామెత ఓ నమ్మకం నుంచి పుట్టింది.శివుడు కేవలం లయకారుడు మాత్రమేననేది చాలా మంది నమ్మకం. కాని అది నిజం కాదు. అయన కేవలం నాశనం చేసీ వాడు మాత్రమే కాదు.ఈ సృష్టిలోని సమస్త చరా చార ప్రాణ కోటికి ఆయనే నాధుడు. అయన అజ్ఞా లేనిదే ఏ పని జరగదు.ఈ విషయం నుంచే ఫై మాట పుట్టింది. అదే మెల్లగా సామెతలా మారింది. ఏదైనా గొప్ప పని చేసినప్పుడు అదంతా తమకు తాముగా సాధించామని కొందరు గొప్పలు పోతుంటారు.అలాగే మరి కొందరు ఏదైనా అనుకొనిది జరిగితే ఎలా జరిగిందని విస్తు పోతుంటారు.ఇలాంటి సందర్భంలోలో అంతా దేవుడి వల్లే జరిగింది అని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు

Bhakthi Tv Videos-Dharma Sandehalu Main Episodes-Part 1

శివ లింగం ఫై ఏ జలంతో అభిషేకం చేస్తే ఫలితం దక్కుతుంది?
దేవుళ్ళఫై అక్షింతలు వేయడం అంటే వారిని మనం అశ్విరదించడం కాదా?
ఎవరైనా పడుకున్నప్పుడు వారిని దాటి వెళ్ళకుడాదంటారు ఎందుకు?....ఇక్కడ చూద్దాం
             

                   నది మిధ ప్రయాణిస్తున్నప్పుడు నదిలో చిల్లర వేయలంటారు అని ఎందుకు?
               అశ్విర్వచనం కోసం పాదాలకు నమస్కరించడంలో అంతర్యం ఏమిటి?
            పగలు పూజ చేసుకోవడం వీలు కాని వారు సంధ్య వేళా( సాయంత్రం వేళా చేసుకోవాచ్చ?


                    బిల్వపత్రి చెట్టు ఇంటి ముందర ఉంటె మంచిదా ? వెనుక ఉంటె మంచిదా?
                    దక్షిణమునా గేటు ఉంటె ఎటువంటి పరిమాణాలు ఉంటాయి?
                 ఈ కలియుగంలో ఏ దేవుణ్ణి పూజించాలి ...గురువుని దేవునిగా అరాధించవచ్చా

             

                          గర్భవతులుగా ఉన్నప్పుడు ఆలయాలకి వెళ్ళవచ్చా?
                                 ఇంటిలో చేసి నిత్య పూజలో శంఖాన్ని ఉదావాచ్చ?
               గీతలు అనేకం అని విన్నాను.. భగవద్గీత కాకుండా ఇంకా ఏమైనా గీతలు ఉన్నాయా?
    
                                

                                సర్వకార్య సిద్ది కోసం గణపతిని ఏవిధంగా పూజించాలి ?
                                   "గ"కార మంత్రంలోని విశిస్థత ఏమిటి?
              వివిధ లోహాలతో చేసినా గణపతి ప్రతిమలు ఉంటాయి కదా?..వాటి తత్వాన్ని వివరించండి?